కేరళలో పేలుడు.. ఇద్దరు కార్మికుల మృతి

కేరళలోని ఎర్నాకులంలో ఓ క్వారీ వద్ద పేలుడు సంభవించింది..

Published : 22 Sep 2020 02:17 IST

ఎర్నాకులం: కేరళలోని ఎర్నాకులంలో ఓ క్వారీ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. క్వారీలో పేలుళ్లకు ఉపయోగించే సామగ్రిని ఓ భవనంలో భద్రపరచగా సోమవారం అందులో పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడుకుగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మరణించిన ఇద్దరు కూడా వలస కార్మికులుగా పేర్కొన్నారు. ఒకరు తమిళనాడుకు చెందిన పెరియన్నన్‌ కాగా మరో వ్యక్తి కర్ణాటకకు చెందిన డి.నాగగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని