పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్పొరా గ్రామంలో...
పుల్వామా: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహించి ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాది లొంగిపోయినట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వారి వద్దనుంచి తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ‘పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో స్థానిక ఉగ్రవాది లొంగిపోయాడు. ఆపరేషన్ కొనసాగుతోంది’ అని కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.
పాంపొరే ప్రాంతంలో గురువారం సైతం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కట్టడిముట్టడికి వెళ్లిన సెక్యూరిటీ బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ఓ ఉగ్రవాదిని హతమార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.