Crime news: గోవధ అనుమానంతో గిరిజనులపై సామూహిక దాడి.. ఇద్దరి మృతి
గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో గిరిజనులను చితకబాదిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మందితో కూడిన బృందం...
భోపాల్: గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో గిరిజనులను చితకబాదిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మందితో కూడిన బృందం ఆ గిరిజనుల ఇంటికి వెళ్లి.. గోవధ చేశారంటూ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆపై ఇద్దరిని దారుణంగా కొట్టారన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు చెప్పారు. సియోని ఏఎస్పీ ఎస్కే మారావి, ఇతర అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. 20 మందిపై అభియోగాలు మోపామని, వారిలో ఆరుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
దాడిలో గాయపడిన బ్రజేష్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో సంపత్, ధన్సాలను నిందితులు కర్రలతో దారుణంగా కొట్టారని, అక్కడికి వెళ్లగా తనపైనా దాడి చేశారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని, గాయపడిన వ్యక్తికి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ డిమాండ్ చేశారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఆదివాసీలపై అత్యధిక నేరాలు మధ్యప్రదేశ్లోనే జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా జబల్పూర్- నాగ్పూర్ హైవేపై నిరసనకు దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?