యజమాని గొంతు కోసి.. బావిలో పడేసి..
జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత..
జీతం విషయంలో జరిగిన గొడవతో హత్యకు పాల్పడ్డ నౌకరు
దిల్లీ: జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన తస్లీమ్ (21), యజమాని ఓంప్రకాశ్ (45) డెయిరీ ఫామ్లో రూ.15 వేల జీతానికి పనిచేసేవాడు. అయితే కరోనాతో నష్టపోయానని, ఈనెల తక్కువ జీతం తీసుకోవాల్సిందిగా తస్లీమ్ను యజమాని కోరాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఓంప్రకాశ్ నౌకరుపై చేయిచేసుకున్నాడు.
యజమానిపై కోపం పెంచుకున్న అతడు ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న ఓం ప్రకాశ్ తలపై కర్రతో దాడిచేశాడు. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీప బావిలో పడేసి పరారయ్యాడు. తర్వాతి రోజు యజమాని బంధువులకు ఫోన్ చేసి వ్యాపార పనిపై తాను ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపాడు. అయితే ఓం ప్రకాశ్ రెండు రోజులుగా కనిపించడం లేదంటూ అతడి మేనల్లుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డెయిరీ ఫాం వద్ద పరిశీలిస్తుండగా అక్కడి బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. వెళ్లి చూడగా బాధితుడి మృతదేహం బావిలో తేలుతూ కనిపించింది.
దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మృతుడి బైకు, సెల్ఫోన్ను తస్లీమ్ ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. యూపీతోపాటు హరియాణాలోని పలు ప్రాంతాల్లో గాలించినా నిందితుడి ఆచూకీ లభించలేదు. దిల్లీలోని ఝరోడా ప్రాంతంలో ఉన్నట్లు ఆదివారం సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు