UP: 35కు చేరిన కల్తీ మద్యం మృతులు
ఉత్తర్ప్రదేశ్లోని కర్సువాలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
చికిత్స పొందుతూ మరో 24 మంది మృతి
అలీగఢ్: ఉత్తర్ప్రదేశ్లోని కర్సువాలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలీగఢ్ పరిధిలోని కర్సువా ప్రాంతంలోని ప్రభుత్వం ఆమోదం పొందిన రెండు దుకాణాల్లో మద్యం కొని సేవించిన పలువురు అస్వస్థకు గురయ్యారు. పరిస్థితి విషమించి ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. ఈ మరణాలపై యూపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లా ఎక్సైజ్ అధికారితోపాటు, మరో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది.
కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందినట్లు, పలువురు అస్వస్థకు గురైనట్లు లోధా పోలీసులకు శుక్రవారం తొలుత ఫిర్యాదు అందింది. ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టగా.. కర్సువా గ్రామంతోపాటు పరిసర 3 గ్రామాల్లో మొత్తం 11 మంది మృతి చెందినట్లు తేలింది. ఆయా గ్రామాలకు అదనపు పోలీసు సిబ్బంది చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అస్వస్థకు గురైన పలువురిని ఆసుపత్రుల్లో చేర్చారు. కాగా అందులో శుక్రవారం ఐదుగురు, శనివారం మరో 19 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.
విచారణ చేపట్టిన పోలీసులు కల్తీ మద్యం విక్రయించిన రెండు దుకాణాలను సీజ్ చేసి, పరీక్షల కోసం మద్యం నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం విక్రయించిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్