Crime news: పీవోకేలో ఘోర ప్రమాదం.. 22మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 22మంది దుర్మరణం చెందగా.......
ఇస్లామాబాద: పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 22మంది దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. సుధోంటి జిల్లా బలోచ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో తలెత్తిన సాంకేతిక సమస్యతో రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులోకి పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.
సమీపంలో ఉన్న రోడ్డు పక్కన వ్యాపారి ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అక్కడే ఉన్న ఓ మత పెద్దకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్టు డాన్ పత్రిక పేర్కొంది. మత గురువు ఈ ప్రమాదం గురించి మసీదులో మైకులో ప్రకటించారనీ.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కోరారని పేర్కొంది. పీవోకే ప్రమాదకరమైన రహదారులతో కూడిన పర్వత ప్రాంతం. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల్లో సమస్యల కారణంగా ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత నెలలో పాక్ ఆక్రమిత ప్రాంతంలోని పూంచ్, నీలమ్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థులతో పాటు కొందరు ప్రయాణికులు మృతిచెందగా.. 32 మంది గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు