ఆరుబయట మూత్రం పోశాడని కొట్టి చంపారు

ఓ యువకుడు ఆరుబయట మూత్రం పోశాడని అతడిని తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఆ రాష్ర్టంలోని బరైచ్‌ జిల్లా ఖైరీదికోలీ

Published : 17 Nov 2020 01:43 IST

లఖ్‌నవూ : ఓ యువకుడు ఆరుబయట మూత్రం పోశాడని అతడిని తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఖైరీదికోలీ గ్రామంలో సుహైల్‌ అనే 23 ఏళ్ల యువకుడు తన బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతడు తను ఉండే బంధువుల ఇంటి ఎదుట మూత్ర విసర్జన చేశాడు. దీన్ని చూసిన ఆ చుట్టపక్కల ఇళ్లలో నివాసం ఉండే రామ్‌మూరత్‌, ఆత్మారామ్‌, రాంపాల్‌, మంజీత్‌ తదితర వ్యక్తులు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సుహైల్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆ వ్యక్తులందరూ కలిసి యువకుడిని కర్రలతో విపరీతంగా కొట్టారు. ఈ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.  

తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. దీనిపై యువకుడి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కర్రలతో దాడి చేసినట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధం ఉండి పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో పట్టుకుంటామని బరైచ్‌ జిల్లా ఎస్పీ విపిన్‌ మిశ్రా తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని