పాక్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు వీరమరణం
పాక్ మరోసారి హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు............
మరో ముగ్గురు పౌరులు మృతి
8 మంది పాక్ సైనికుల హతం
శ్రీనగర్: పాక్ హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు కూడా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. బారాముల్లోలోని నంబ్లా సెక్టార్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జనాన్లు అమరులయ్యారు. పాక్ సైన్యం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేశారు. హాజీ పీర్ సెక్టార్లో జరిగిన ఘటనలో ఓ బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వీర మరణం పొందగా.. మరో జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని యురి ప్రాంతం కామల్కోటే సెక్టార్లో జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డడారు. బాల్కోటే ప్రాంతం హాజీ పీర్ సెక్టార్లో జరిపిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలు ప్రాంతాల్లో జరిపిన దాడిలో పలువురు పౌరులు కూడా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
పాక్ బంకర్లను పేల్చివేసిన ఆర్మీ
యురి, హీజీపీర్, కమల్ కోట్, బాలాకోట్ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిన పాక్ బలగాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ బంకర్లు, ఇంధన ట్యాంకులు, లాంచ్ ప్యాడ్లను భారత ఆర్మీ పేల్చివేసింది. ఈ దాడుల్లో దాదాపు ఎనిమిది మంది పాకిస్థాన్ సైనిక సిబ్బంది హతమయ్యారు. వీరిలో పాకిస్థాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ)కి చెందిన ముగ్గురు కమాండోలు ఉన్నారని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరో 10 నుంచి 12మంది పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందికి తీవ్ర గాయాలపాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా