Borewell: మూడ్రోజులైంది.. నా బిడ్డను త్వరగా బయటకు తీయండి.. ఓ తల్లి రోదన
మధ్యప్రదేశ్లోని బైతుల్ జిల్లా మాండవి గ్రామంలో మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బోరు బావి(Borewell)లో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు గత ఇంకా సహాయక చర్యలు(Rescue operation) కొనసాగుతున్నాయి.
భోపాల్: మధ్యప్రదేశ్లోని బైతుల్ జిల్లా మాండవి గ్రామంలో మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బోరు బావి(Borewell)లో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు గత ఇంకా సహాయక చర్యలు(Rescue operation) కొనసాగుతున్నాయి. తన్మయ్ (8) అనే బాలుడు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరు బావిలో జారిపడిన ఘటన విషాదం రేపిన విషయం తెలిసిందే. 50అడుగుల లోతులో చిక్కుకున్న ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బాలుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటి నుంచి ఆక్సిజన్ అందిస్తున్నారు. అలాగే, బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నారు. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పందించారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
నేతలు, అధికారుల పిల్లలైతే ఇలాగేనా?: తల్లి ఆవేదన
మూడు రోజులు గడుస్తున్నా అధికార యంత్రాంగం ఆ బాలుడిని బయటకు తీయలేకపోవడంపై తన్మయ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారుల తీరుపట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ‘‘తక్షణమే నా బాబుని బయటకు తీయండి. ఏం చేసినా నాకు నా బిడ్డను తీసి ఇవ్వండి. ఒక నాయకుడి బిడ్డ, అధికారి బిడ్డ అయితే బయటకు తీయడానికి ఇంత సమయమే పట్టేదా? ఇప్పటికే చాలా సమయం గడిచినా ఏమీ చెప్పడంలేదు. చూడటానికి నేను వెళ్తానన్నా అనుమతించడంలేదు. తన్మయ్ మంగళవారం బోరుబావిలో పడిపోయాడు. ఈరోజు శుక్రవారం. నా కొడుకును బయటకు తీసుకురండి. నేను నా బిడ్డను చూడాలి’’ అంటూ తన కొడుకు కోసం ఆ తల్లి ఆర్తనాదాలు అందరినీ కలిచివేస్తున్నాయి. తన్మయ్ బోరుబావిలో పడిపోతున్నప్పుడు తన 12ఏళ్ల కూతురు చూసిందని తండ్రి సునీల్ సాహూ తెలిపారు. వెంటనే తనకు చెప్పడంతో ఘటనాస్థలం వద్దకు వెళ్లామని. అప్పటికి ఊపిరి పీల్చుకొంటున్నాడని.. తమ మాటలకు స్పందించాడని తెలిపారు.
మరోవైపు, మూడో తరగతి చదువుతున్న తన్మయ్ క్షేమంగా బయటకు రావాలని కోరుతూ తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గాయత్రి మంత్రం జపిస్తున్నారు. ఈ ఘటనపై బేతల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే 45 అడుగులకు పైగా సొరంగం తవ్వకం పూర్తయింది. మధ్య మధ్యలో బండరాళ్లు తగలడం వల్ల యంత్రాలతో వాటిని విరగ్గొట్టడంతో సమయం పడుతోంది. ఇది అత్యంత సున్నితమైన పరిస్థితి కావడంతో బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతూ పిల్లవాడిని చేరుకొని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.