Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
ఓ సినిమాలో దోపిడీ (Robbery) సీన్తో ప్రేరణ పొందిన ముగ్గురు వ్యక్తులు.. అదే స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పుణె: ఓ సినిమాలోని దొంగతనం సీన్తో ప్రేరణ పొంది అచ్చం అలాంటి చోరీకే (Robbery) పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అలా రూ.47 లక్షలు కాజేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానాపేట్కు చెందిన మంగళ్పురి గోస్వామి అనే వ్యక్తి మార్కెటింగ్ ఏజెన్సీలో 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏజెన్సీకి సంబంధించిన డబ్బును బ్యాంకులో వేయడం అతని విధి. కొంతకాలంగా ఇది గమనిస్తున్న కొందరు వ్యక్తులు అతడి నుంచి డబ్బు కాజేసేందుకు ప్రణాళిక రచించారు. దీంతో రోజూలాగే బ్యాంకుకు వెళుతున్న గోస్వామిని ఇటీవల ఉదయం ఆజాద్ చౌక్ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. పదునైన కత్తి చూపించి బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.47 లక్షల డబ్బును దోచుకుని పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మార్చి 23న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం నిందితులను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని 500 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వీడియోలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు గైక్వాడ్ పట్టుకున్నారు. నానాపేట్కు చెందిన రుషికేశ్ గైక్వాడ్, కిరణ్ అశోక్ పవార్, ఆకాష్ కపిల్ గోరాడ్లు ఈ దోపిడీకి పాల్పడ్డట్లు నిర్ధారించారు. గైక్వాడ్ గతంలో మార్కెటింగ్ ఏజెన్సీలో సేల్స్మెన్గా పనిచేసినట్లు విచారణలో వెల్లడైంది. పనిచేస్తున్న సమయంలో అతడిపై కొన్ని ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం.. గోస్వామి రోజూ నగదు తీసుకెళ్లడాన్ని గమనించిన నిందితుడు అతన్నుంచి డబ్బు కాజేయాలని పథకం పన్నాడు. ఓ సినిమా నుంచి ప్రేరణ పొందిన అతడు.. తన స్నేహితులతో కలిసి అచ్చం అలానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. నిందితుల నుంచి రూ.25 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్