Crime news: అమ్మ కోసం కన్యత్వం అమ్మకానికి.. ముగ్గురి అరెస్ట్
కన్నతల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బుల్లేక విధిలేని పరిస్థితుల్లో ఓ పదకొండేళ్ల బాలిక తను అంగడిసరకుగా మారడానికి సిద్ధమైంది. ఐదువేల
నాగ్పూర్: కన్నతల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బుల్లేక విధిలేని పరిస్థితుల్లో ఓ పదకొండేళ్ల బాలిక తను అంగడిసరకుగా మారడానికి సిద్ధమైంది. ఐదువేల రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. హృదయవిదారకమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ బాలిక ఆ రొంపిలోకి దిగకముందే పోలీసులు ఆమెను రక్షించారు. చిన్నారిని ఒత్తిడి చేసి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. ఆమె కోసం రూ.40వేలు చెల్లించడానికి సిద్ధమైన విటుడే బాలిక దీనగాథకు చలించి ఇన్ఫార్మర్గా మారడం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం బాధిత బాలిక తల్లి కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అవసరాన్ని పొరుగున ఉండే అర్చనా వైశంపాయన్ (39) పసిగట్టింది. మాయమాటలు చెప్పి బాలిక కన్యత్వానికి రూ.5వేలు వెల కట్టేలా ఒప్పించి, తనతో పంపమంది. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఒప్పుకుంది. అర్చనతోపాటు రంజనా మెష్రామ్ (45), కవితా నిఖారే (30)లు ఓ వ్యక్తితో రూ.40వేలకు బేరం కుదిర్చారు. కానీ బాలికను ‘కొనుగోలు’ చేసిన విటుడే జాలిపడి ఓ స్వచ్ఛంద సంస్థకు ఉప్పందించాడు. ఆ సంస్థ సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్బీ) పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం