Delhi: ఒక హత్య.. 300 సీసీ కెమెరాలతో ఛేదించి..
ఒక హత్య కేసును ఛేదించడం కోసం పోలీసులు 300 సీసీ కెమెరాలను పరిశీలించి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు.
దిల్లీ: ఒక హత్య కేసును ఛేదించడం కోసం పోలీసులు 300 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన రామ్ కిశోర్ అగర్వాల్ అనే బిల్డర్ మృతదేహాన్ని అతని నివాసంలో పోలీసులు గుర్తించారు. ఆయన గొంతు, శరీరంపై కత్తి పోట్లు ఉన్నాయి. అతని ఇంట్లోని డబ్బు దొంగిలించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో దొంగతనానికి వచ్చిన దుండగులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు మృతుడి ఇంటి సమీపంలోని 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. దిల్లీ మెట్రో స్మార్ట్లపై నిఘా పెట్టి, మెట్రో సిబ్బందితో కలిసి సంయుక్తంగా చర్యలు తీసుకున్నారు.
హత్య జరగడానికి రాత్రి నిందితులు ఒక బైక్ను దొంగతనం చేసి దానిని మృతుడి ఇంటి ముందు పార్కు చేసినట్లు సీసీ కెమెరాలో పోలీసులు గమనించారు. దీంతో పోలీసులు మెట్రోలో నిందితుల కదలికలను ట్రాక్ చేసి అక్కడి అధికారులను, సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. నిందితుల మెట్రో స్మార్ట్ కార్డ్పై నిఘా ప్రారంభించారు. దాని ఆధారంగా ట్రాక్ చేసి రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బిల్డర్ ఇంట్లో క్లీనర్గా పని చేసిన వాళ్లే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు బీహార్కి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారిలో ఒకరు మైనర్ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్