Crime news: హోటల్‌కి ఆహ్వానించి.. మహిళపై సామూహిక అత్యాచారం

దిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో హోటల్‌ గదికి పిలిచి 31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Published : 11 Oct 2022 15:50 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఓ మహిళపై దారుణం చోటుచేసుకుంది. దిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో హోటల్‌ గదికి పిలిచి 31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను రాజస్థాన్‌లోని అళ్వార్‌కు చెందిన అజయ్‌ (39), చాంద్‌ (34), నరేశ్‌(38)లుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (నార్త్‌ వెస్ట్‌) ఉషా రంగ్నాని వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రోజున ఈ ఘటనపై ఆదర్శ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు పీసీఆర్‌ కాల్‌ వచ్చింది.

బాధిత మహిళకు పరిచయం ఉన్న అజయ్‌ అనే వ్యక్తి మహిళను ఆదివారం రోజున  హోటల్‌ గదికి ఆహ్వానించాడు. అలాగే, తన మరో ఇద్దరు స్నేహితులను కూడా పిలిచాడు. అనంతరం మహిళకు శీతలపానియాన్ని ఆఫర్ చేయగా.. దాన్ని తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.  మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు డీసీపీ వెల్లడించారు. హోటల్‌ నుంచి క్రైమ్‌ టీమ్‌ నమూనాలను సేకరించిందని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని