ఎమ్మెల్సీ ఇంట్లో కాల్పులు.. ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ ఫ్లాట్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. రాకేశ్‌ (35) అనే వ్యక్తి సొంత తుపాకీకి బలయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నాడా? లేడా? అనే దానిపై పోలీసులు..

Updated : 21 Nov 2020 13:24 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ నివాసంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నారా? లేరా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లఖ్‌నవూలోని ఖరీదైన ప్రాంతంలోని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాజహాన్‌పుర్‌ ఎమ్మెల్సీ అమిత్‌ యాదవ్‌ ఇంట్లో శనివారం ఉదయం పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన రాకేశ్‌(35) అనే వ్యక్తి తాను తీసుకొచ్చిన తుపాకీని మరో వ్యక్తికి ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి అనుకోకుండా రాకేశ్‌ ముఖంపై కాల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. రాకేశ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని