
Crime news: నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి మృతి; 12మందికి గాయాలు!
చండీగఢ్: హరియాణాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రపోతున్న వలస కూలీల పైనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణాలోని ఝజ్జర్లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందగా.. 12మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కు డివైడర్ను ఢీకొట్టిన అనంతరం నిద్రపోతున్న కూలీలపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆ రహదారిపై ప్రమాదకరంగా వాహనాలు తిరుగుతుండటంతో అక్కడ నిద్రపోవద్దంటూ వలస కూలీలకు పెట్రోలింగ్ పోలీసు బృందాలు హెచ్చరించిన మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకుంది.
బహదుర్గఢ్లోని ఆసోడా టోల్ప్లాజా సమీపంలో కుండ్లి-మానేసర్-పాల్వాల్ (కేఎంపీ) ఎక్స్ప్రెస్ వేపై ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అక్కడ 18 మంది కూలీలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతులంతా కాన్పూర్కు చెందిన వారు కాగా.. గాయపడిన వారిలో యూపీలోని కాన్పూర్, కన్నౌజ్, ఫరూఖాబాద్లకు చెందినవారు ఉన్నారన్నారు. ఓ వంతెన రిపైర్ పనులు జరుగుతుండగా పనిచేసేందుకు వచ్చిన వీరంతా రాత్రిపూట రోడ్డుపక్కనే నిద్రపోతుంటారని పోలీసులు తెలిపారు. అయితే, కూలీలు అక్కడే నిద్రిస్తున్నా.. అలాగే వదిలేసిన కాంట్రాక్టర్, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం