Crime news: బస్సులో ఒక్కసారిగా మంటలు.. నలుగురు మృతి.. 20మందికి గాయాలు

జమ్మూలోని కాట్రా సమీపంలో విషాదం చోటుచేసుకుంది. కాట్రా నుంచి జమ్మూ వైపు ప్రయాణిస్తున్న....

Published : 14 May 2022 02:41 IST

జమ్మూ: జమ్మూలోని కాట్రా సమీపంలో విషాదం చోటుచేసుకుంది. కాట్రా నుంచి జమ్మూ వైపు ప్రయాణిస్తున్న వైష్ణోదేవి యాత్రికుల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. దాదాపు 20మందికి పైగా గాయపడ్డారు. వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనే భక్తులకు కాట్రా బేస్‌ క్యాంపుగా ఉంది. ఈ ఘటనపై జమ్మూ జోన్‌ అదనపు డీజీ ముకేశ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఎలాంటి పేలుడు పదార్థాలూ ఉపయోగించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలలేదన్నారు. వెంటనే ఫోరెన్సిక్‌ నిపుణుల్ని రంగంలోకి దించి మంటలు చెలరేగడానికి గల కారణాలను గుర్తిస్తున్నట్టు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో మంటలను అదుపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని