Crime news: ఆ లింక్పై క్లిక్ చేస్తే.. నటి సహా 40మంది ఖాతాల్లో నగదు కట్!
సైబర్ మాయగాళ్లు వేసిన వలలో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన 40మంది అమాయకులు నగదు పోగొట్టుకున్నారు. వీరిలో టీవీ నటి శ్వేతా మేనన్ కూడా ఉన్నారు.
ముంబయి: సైబర్ కేటుగాళ్లు(Cyber crimes) ఏ రూపంలో వచ్చి బ్యాంకు ఖాతాల్ని కొల్లగొడతారో ఊహించడం కష్టమైపోతోంది. నిజమేదో, అబద్ధమేదో తెలియని అయోమయంలో అనేకమంది సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో పడి మోసపోతున్నారు. తాజాగా కేవైసీ, పాన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటూ టెక్స్ట్ సందేశంలో లింక్ పంపగా.. దానిపై క్లిక్ చేసిన మూడు రోజుల వ్యవధిలోనే ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన 40మంది ఖాతాల్లోంచి రూ.లక్షల విలువైన నగదు మాయమైన ఘటన ముంబయిలో వెలుగు చూసింది. తమ కస్టమర్ల గుర్తింపును వెరిఫై చేసుకొనేందుకు బ్యాంకులు నో యువర్ కస్టమర్ (KYC) ప్రక్రియను చేపట్టగా.. సైబర్ నేరగాళ్లు దాన్ని తమ దోపిడీకి ఆయుధంగా మలచుకొని అమాయకుల్ని దోచేస్తున్నారు. ఇలా మోసానికి గురైన వారిలో టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు, అప్రమత్తమైన పోలీసులు బ్యాంక్ వినియోగదారుల రహస్య వివరాలను కోరే లింక్లపై క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మోసగాళ్లు అలాంటి నకిలీ ఎస్ఎంఎస్లను వినియోగదారులకు పంపిస్తూ కేవైసీ/పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతాలు బ్లాక్ అయిపోతాయంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. అలా తాము పంపిన లింక్లపై క్లిక్ చేసిన వినియోగదారులను నకిలీ వెబ్సైట్కు మళ్లించి వారి ఐడీ, పాస్వర్డ్, ఇతర వివరాలను ఎంటర్ చేయమని అడుగుతున్నారన్నారు. ఇలా లింక్పై క్లిక్ చేయడం ద్వారా మోసపోయినట్టు 40మంది ఫిర్యాదులు చేశారని.. వీరిలో టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నట్టు చెప్పారు. ‘‘ ఆ లింక్ బ్యాంకు నుంచి వచ్చినట్టు నమ్మి క్లిక్ చేశాను. పోర్ట్ ఓపెన్ కాగా.. అందులో కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ ఎంటర్ చేశాను. ఆ తర్వాత బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకుంటూ ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తన ఫోన్లోకి పంపిన మరో ఓటీపీని కూడా చెప్పాలని అడగడంతో నేను ఎంటర్ చేశా. ఈ క్రమంలో నా ఖాతా నుంచి రూ.57,636ల నగదు డెబిట్ అయింది’’ అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, ఆశచూపిస్తూ పంపించే ఇలాంటి లింక్లపై క్లిక్ చేయవద్దని ముంబయి సైబర్ క్రైం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
-
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
-
ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్ జుకర్బర్గ్ అంచనా!
-
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
-
అతడో ‘లెర్నింగ్ మెషిన్’.. గుకేశ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?