Noida: పెళ్లి వేడుకలో కాల్పులు.. పలువురికి గాయాలు..

పెళ్లి వేడుకలో జరిగిన కాల్పుల్లో ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు గాయపడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాదల్‌పూర్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటన

Published : 21 Apr 2022 12:23 IST

నోయిడా: పెళ్లి వేడుకలో జరిగిన కాల్పుల్లో ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు గాయపడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాదల్‌పూర్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాదల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది. వరుడు అక్కడకు చేరుకొన్నట్లు సంకేతంగా బంధువు ఒకరు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.

ఆ సమయంలో తూటాలు ప్రమాదవశాత్తు నేలను తాకి చుట్టుపక్కల వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. పెళ్లివేడుకల్లో కాల్పులు జరపడంపై నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని