Mumbai: రూ.7 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఏడుగురి అరెస్టు!
మహారాష్ట్రలోని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడుల్లో రూ.7 కోట్ల మేర నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి.
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడుల్లో రూ.7 కోట్ల మేర నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. దీంతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అంతర్రాష్ట్ర ముఠాకు చెందినవారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ముంబయి శివారు ప్రాంతంలోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద నిందితుల కారును అడ్డగించినట్లు చెప్పారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2 వేల నోట్లు ఉన్న బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్పై దాడి చేసి మరో ముగ్గురుని అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి కూడా మరో రూ.2 కోట్లు విలువైన 100 కట్టల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు