- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
గతేడాది రైలు ప్రమాదాల్లో 8,733 మంది మృతి
దిల్లీ: గతేడాది కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ప్రజా రవాణా వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైళ్లు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అయినా రైలు ప్రమాద మృతుల సంఖ్యలో పెద్దగా మార్పేమి కనిపించలేదు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 8,700 మందికి పైగా మృతి చెందారు. మధ్యప్రదేశ్కి చెందిన చంద్ర శేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్య ఎంత మంది మరణించారని రైల్వే బోర్డుని ప్రశ్నించారు. ‘‘వివిధ రాష్ట్రాల రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు 8,733 మంది రైలు ప్రమాదాల్లో చనిపోయారు. 805 మంది తీవ్ర గాయాల పాలయ్యారు’’ అని రైల్వే బోర్డు సమాధానమిచ్చింది. మృతుల్లో ఎక్కువ మంది లాక్డౌన్ కారణంగా రైల్వే ట్రాకుల వెంట కాలినడకన స్వస్థలాలకు పయనమైన వలస కూలీలే ఉన్నారు. 2020 కంటే నాలుగు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అయితే, 2020 మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి చూస్తే మాత్రం ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
-
Movies News
Nassar: సినీ నటుడు నాజర్కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
-
Crime News
Chocolate: గోదాంలోకి చొరబడి చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ధర రూ.17లక్షలు!
-
General News
Telangana News: వాసవి గ్రూప్ స్థిరాస్తి సంస్థపై ఐటీ దాడులు.. 40 బృందాలతో సోదాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..