UP: 42 ఏళ్ల క్రితం 10 హత్యలు.. 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు!
ఉత్తర్ప్రదేశ్లో 42 ఏళ్ల క్రితం నాటి సామూహిక హత్యల కేసులో 90 ఏళ్ల వృద్ధుడికి ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. మొత్తం 10 మంది నిందితుల్లో అతనొక్కడే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నాడు.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో దాదాపు 42 ఏళ్ల క్రితం నాటి సామూహిక హత్య కేసు (Shikohabad Murder Case)లో ఓ 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు పడింది. దీంతోపాటు కోర్టు అతనికి రూ.55 వేల జరిమానా కూడా విధించింది. అధికారుల వివరాల ప్రకారం.. 1981లో అప్పటి మైన్పురీ జిల్లాలోని శికోహాబాద్లో పలువురు కలిసి 10 మంది దళితులను కాల్చి చంపారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 10 మంది నిందితులపై మెయిన్పురి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
అయితే, శికోహాబాద్ ఇప్పుడు ఫిరోజాబాద్ జిల్లాలోని మఖన్పూర్ పరిధిలోకి మారింది. ఈ క్రమంలో 2021 అక్టోబర్లో ఈ కేసు ఫిరోజాబాద్కు బదిలీ అయింది. అయితే, ఈ కేసులోని 10 మంది నిందితుల్లో తొమ్మిది మంది విచారణ సమయంలో మరణించారు. ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక నిందితుడు గంగా దయాళ్ (90)ను కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించింది. రూ.55 వేల జరిమానా కూడా వేసింది. చెల్లించని పక్షంలో అదనంగా 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.