చంపాపేట నాలాలో కాలు కలకలం
చంపాపేటలోని ఓ నాలాలో కాలు కలకలం రేపింది. నాలాలో ఓ వ్యక్తి కాలు కొట్టుకొచ్చింది. మోకాలి వరకు ఉన్న కాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు...
సైదాబాద్ (హైదరాబాద్): చంపాపేటలోని ఓ నాలాలో కాలు కలకలం రేపింది. నాలాలో ఓ వ్యక్తి కాలు కొట్టుకొచ్చింది. మోకాలి వరకు ఉన్న కాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో వరద ప్రవాహం పోటెత్తింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎడమ మోకాలు వరద నీటిలో తేలియాడుతూ కనిపించడంతో చంపాపేటలోని రెడ్డి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ మోకాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహిస్తూ చంపాపేటలో ఉన్న రెడ్డి కాలనీకి చేరుకుంది. నాలాలో సుమారు 50 సంవత్సరాలున్న ఓ గుర్తుతెలియని వ్యక్తికి చెందిన ఎడమ మోకాలు తేలియాడుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
ఏదో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసి తొలగించిన కాలు తరహాలో ఉందంటూ పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తరహా ఘటన చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. నేరేడ్మెట్ ప్రాంతంలో సైకిల్ తొక్కుతూ మురుగు కాల్వలో పడి మృతి చెందిన చిన్నారి ఉదంతం జరిగిన రెండో రోజే మోకాలు దర్శనమివ్వడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై లవణం వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్