‘రూ.25లక్షలివ్వండి లేదంటే భవనాలు కూల్చేస్తా’
నక్సలైట్నంటూ నగరంలోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తిని బెదిరించిన విషయంపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
నక్సలైట్నంటూ వ్యక్తి బెదిరింపులు.. కేసు నమోదు, అరెస్ట్
పంజాగుట్ట(హైదరాబాద్): నక్సలైట్నంటూ నగరంలోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తిని బెదిరించిన విషయంపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పంజాగుట్ట అడ్మిన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో అపర్ణ నిర్మాణ సంస్థ కార్యాలయం ఉంది. ఈనెల 12న మెహిదీపట్నానికి చెందిన నగేశ్ కుమార్ పట్నాయక్ అనే వ్యక్తి ఆ కార్యాలయానికి వెళ్లాడు. ఎండీ ఉన్నారా? అంటూ అక్కడున్న సిబ్బందిని అడిగారు. ఎండీ లేరని.. ఏదైనా పని ఉంటే ఏజీఎం సూర్యారావును కలవాలని సిబ్బంది సూచించారు.
ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఈనెల 14న సూర్యారావుకు ఫోన్ చేశారు. తాను నక్సలైట్నని.. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో షేక్పేటలో నిర్మాణంలో ఉన్న అపర్ణ నిర్మాణ సంస్థకు చెందిన భవనాలను కూల్చివేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై సదరు సంస్థ ప్రతినిధులు సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు.. మంగళవారం మొహిదీపట్నంలో నగేశ్ కుమార్ పట్నాయక్ను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం