జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి కలకలం రేపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని..
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి కలకలం రేపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్యా స్వాతి, అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వాతి భర్త రవి ఆరు నెలల క్రితం చనిపోయాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వాతి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇవాళ పనిమీద మెట్పల్లికి వెళ్లిన స్వాతి సాయంత్రానికి తండా బస్టాండ్కు చేరుకుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. హెల్మెట్ ధరించి ఉన్న గుర్తుతెలియని దుండగుడు ఆమె ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో మహిళ ముఖం కుడి భాగం కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM