జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి

జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి కలకలం రేపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్‌ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని..

Published : 24 Dec 2020 00:47 IST

ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్‌ దాడి కలకలం రేపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండా సమీపంలోని బస్టాండ్‌ నుంచి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌ పోసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్యా స్వాతి, అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వాతి భర్త రవి ఆరు నెలల క్రితం చనిపోయాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వాతి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇవాళ పనిమీద మెట్‌పల్లికి వెళ్లిన స్వాతి సాయంత్రానికి తండా బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా.. హెల్మెట్‌ ధరించి ఉన్న గుర్తుతెలియని దుండగుడు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో మహిళ ముఖం కుడి భాగం కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని