డ్రగ్స్ కేసులో హాస్యనటి దంపతుల అరెస్టు
బాలీవుడ్లో మరో కుదుపు. మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ హాస్యనటి భారతిసింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియ్యాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది....
ముంబయి: బాలీవుడ్లో మరో కుదుపు. మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ హాస్యనటి భారతిసింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియ్యాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శనివారం భారతిసింగ్ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. ఆ తర్వాత ఆదివారం ఉదయం ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకుంది. విచారణలో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. ఎన్సీబీ అధికారుల వివరాల ప్రకారం.. దర్యాప్తు సంస్థ శనివారం ఉదయం భారతిసింగ్, హర్ష్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కాగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించింది. దీంతో అధికారులు భార్యాభర్తలకు సమన్లు జారీ చేశారు.
ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో శనివారం విచారణకు హాజరైన దంపతులను అధికారులు విడివిడిగా ప్రశ్నించారు. దాదాపు 15 గంటలపాటు జరిగిన విచారణలో వారిరువురు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకొన్నారు. ‘భారతిసింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియ్యా గంజాయి సేవించినట్లు ఒప్పుకొన్నారు. దీంతో దంపతులను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశాం’ అని ఎన్సీబీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డ్రగ్స్ కేసులో గతంలో అరెస్టు చేసిన డ్రగ్స్ సరఫరా చేసిన ఓ వ్యక్తిని విచారించగా అతడు భారతిసింగ్ పేరును వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నటుడు సుశాంత్సింగ్ రాజ్పూత్ మృతి అనంతరం బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం రేపింది. విచారణ చేపట్టిన ఎన్సీబీ సుశాంత్కు అతడి సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారించి ఆమెను అరెస్టు చేసింది. నటితోపాటు ఆమె సోదరుడు, పలువురిని అదుపులోకి తీసుకుంది. మరికొంతమంది ప్రముఖ నటీమణులను విచారించింది. దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్, రకుల్ప్రీత్సింగ్, సారా అలీఖాన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల నటుడు అర్జున్రాంపాల్, అతడి ప్రియురాలు గాబ్రియేల్ల దెమిత్రియాడెస్ను అధికారులు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.