కొవిడ్‌ వార్డు నుంచి పారిపోయిన నిందితుడు

ఆయుధ చట్టం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని ఖైదీల ఐసోలేషన్‌ వార్డుకి పంపించగా, అతడు అక్కడి నుంచి పారిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే..లకన్‌ బావరి అనే వ్యక్తిని ఆయుధ చట్టం కింద రాజస్థాన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Published : 19 Oct 2020 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయుధ చట్టం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని ఖైదీల ఐసోలేషన్‌ వార్డుకి పంపించగా, అతడు అక్కడి నుంచి పారిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. లకన్‌ బావరి అనే వ్యక్తిని ఆయుధ చట్టం కింద రాజస్థాన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టు ఎదుట హాజరుపరిచారు. అతడిని జ్యూడీషియల్‌ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు.. పోలీసులకు సూచించింది కోర్టు. జైలుకి తరలించడానికి ముందు బావరికి కరోనా పరీక్ష చేయించడానికి తీసుకెళ్లారు. రిపోర్టులు రాకపోవటంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఖైదీల ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. దాంతో శనివారం రాత్రి అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఐసోలేషన్‌ వార్డులోని కిటకీ గుండా బావరి తప్పించుకుని ఉంటాడని భావిస్తున్నట్లు లోకేందర్‌ పాలివాల్‌ అనే పోలీసు అధికారి పేర్కొన్నారు. అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని