అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ భాజపా నేత

అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ భాజపా నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబును  స్పెషల్‌ ఎన్‌ఫోర్సమెంట్‌......

Updated : 16 Aug 2020 19:44 IST

గుంటూరు: అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ భాజపా నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబును  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.6లక్షలు విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక రామాంజనేయులు సహా మచ్చా సురేశ్‌, కె. నరేశ్‌, గంటా హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు. గుంటూరు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు.

భాజపా నుంచి సస్పెండ్‌
మద్యం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన అంజిబాబు ఆ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని