యూట్యూబర్పై బాబా కా దాబా యజమాని ఫిర్యాదు
తన దాబా పాపులర్ అవడానికి కారణమైన యూట్యూబర్పై బాబా కా దాబా యజమాని కాంతప్రసాద్ (80) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాబా సంక్షేమానికి వచ్చిన విరాళాలను గౌరవ్ వాసన్ దుర్వినియోగం చేశాడంటూ..
విరాళాలను దుర్వినియోగం చేశాడని వెల్లడి
దిల్లీ: తన దాబా పాపులర్ అవడానికి కారణమైన యూట్యూబర్పై బాబా కా దాబా యజమాని కాంతప్రసాద్ (80) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాబా సంక్షేమానికి వచ్చిన విరాళాలను గౌరవ్ వాసన్ దుర్వినియోగం చేశాడంటూ పేర్కొన్నారు. దక్షిణ దిల్లీలో బాబా కా దాబా పేరుతో ఓ వృద్ధ దంపతులు నడిపిస్తున్న హోటల్ లాక్డౌన్ కారణంగా పూర్తిగా దివాలా తీసింది. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో ఆ దాబాకు వెళ్లిన గౌరవ్ వాసన్ అనే వ్యక్తికి తమ గోడును వెల్లగక్కారు ఆ దంపతులు. తమ పరిస్థితిపై కన్నీరు మున్నీరయ్యారు.
ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సదరు యూట్యూబర్ వారికి మద్దతుగా నిలవాలంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాళాలు అందించి వారిని ఆదుకోవాలని కోరాడు. కాగా ఆ వీడియో విపరీతంగా పాపులర్ అయింది. పలువురు ప్రముఖులు, బాలీవుడ్ నటులు ఆ వీడియోని షేర్ చేశారు. దయచేసి ఆ హోటల్లో భోజనం చేసి ఆ దంపతులకు మద్దతుగా నిలవండి అంటూ పేర్కొన్నారు. దీంతో భారీగా విరాళాలు కూడా వచ్చాయి.
అయితే వచ్చిన విరాళాలను యూట్యూబర్ గౌరవ్ వాసన్ దుర్వినియోగం చేశాడంటూ కాంతప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు. యూట్యూబర్ ఉద్దేశపూర్వకంగానే ఆయన కుటుంబసభ్యులు, మిత్రుల బ్యాంకు ఖాతాలను మాత్రమే దాతలతో పంచుకొని భారీ విరాళాలు సేకరించాడని ఆరోపించారు. విరాళాలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం అందించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ స్పందించారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కేసు నమోదు చేయలేదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప 81వ బెటాలియన్లో చోటు చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్