కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి

ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఓ విద్యాలయం సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10మంది మృతి చెందారు.........

Published : 24 Oct 2020 20:05 IST

కాబూల్‌: ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఓ విద్యాలయం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10మంది మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో పాఠశాల చిన్నారులు కూడా ఉన్నట్టు  అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని