ఏడు గంటల హింస.. గోడలపై రక్తం
తూత్తుకుడికి చెందిన జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్లను పోలీసులు ఆరు గంటలకు పైగా హింసించినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది.
తమిళనాడు కస్టడీ మరణాలపై సీబీఐ ఛార్జిషీటు
చెన్నై: తమిళనాడులో జూన్లో చోటుచేసుకున్న తండ్రి, కుమారుల కస్టడీ మరణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ కేసులో తూత్తుకుడికి చెందిన వ్యాపారులు జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్లను పోలీసులు ఆరు గంటలకు పైగా హింసించినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆ గది గోడలపై రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తెలిసింది.
న్యాయమూర్తిపైనే దౌర్జన్యం
మొబైల్ షాపు యజమానులైన పి జయరాజ్ (59), ఆయన కుమారుడు జె బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాన్ని కేవలం పదిహేను నిమిషాలు అధికంగా తెరచి ఉంచారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సతంకుళం పోలీస్ స్టేషన్లో జయరాజ్, బెన్నిక్స్లపై జూన్ 19న విచారణ జరిగింది. అనంతరం వారు తీవ్ర గాయాల వల్ల జూన్ 22న కొద్ది గంటల తేడాతో మరణించారు. వీరు పోలీసుల దౌర్జన్యం వల్లనే చనిపోయారా అనే విషయాన్ని విచారించేందుకు వెళ్లిన కోవిల్పట్టి న్యాయమూర్తి ఎంఎస్ భారతీదాసన్తో పోలీసు సిబ్బంది బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. ఏ రోజుకారోజు డిలీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం వల్ల ఆ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లభించలేదని మేజిస్ట్రేట్ దర్యాప్తులో తేలింది.
కస్టడీలో హింస
ఇదిలా ఉండగా.. ఈ కేసులో నిందితులైన పోలీసు అధికారులు జూన్ 19 రాత్రి 7:45 నుంచి 3:00 మధ్య జయరాజ్ బెన్నిక్స్లను క్రూరంగా హింసించారని సీబీఐ తన ఛార్జిషీటులో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిందిన రక్తాన్ని వారి దుస్తులతోనే శుభ్రం చేయించినట్టు వెల్లడించింది. నిజానికి ఆ వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించనేలేదని.. పోలీసులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారిపై తప్పుడు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని తమ విచారణలో తేలినట్టు సీబీఐ తెలిపింది. విచారణ నాటి గాయాల వల్లే వారు మరణించినట్టు పోస్ట్మార్టం నివేదిక కూడా వెల్లడించింది. రక్తంతో తడిసిన వారి దుస్తులను అక్కడి ప్రభుత్వాసుపత్రిలోని చెత్తబుట్టలో పడేయటం ద్వారా పోలీసులు సాక్ష్యాలను నాశనం చేశారని సీబీఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!