కాల్వలోకి దూసుకెళ్లిన కారు: నలుగురి మృతి
గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం
రొంపిచర్ల: గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య ఈ ప్రమాదం జరిగింది. కారు తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నివాసముంటున్న మాధవ్ అనే వ్యక్తి గృహాలకు రంగులు వేస్తుంటాడు. ప్రకాశం జిల్లా పామూరిలోని సొంతింటికి రంగులు వేయించేందుకు తన దగ్గర పనిచేస్తున్న బీరూగౌడ్, బాలాజీతోపాటు ఉత్తర్ప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని గురువారం రాత్రి జగిత్యాల నుంచి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీరూ గౌడ్, బాలాజీతో పాటు మరో ఇద్దరు మృతిచెందగా.. తీవ్రగాయాలతో బయటపడిన మాధవ్.. అటుగా వెళ్తున్న పోలీసులకు ప్రమాదం గురించి వివరించాడు. దీంతో పోలీసులు కారుతోపాటు మృతదేహాలను వెలికితీసి నర్సారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్