ఇంజిన్‌లో మంటలు.. కారు దగ్ధం

రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన శనివారం రాత్రి మలక్‌పేట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల

Updated : 18 Oct 2020 03:31 IST

చాదర్‌ఘాట్‌ క్రైం: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన శనివారం రాత్రి మలక్‌పేట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన వెంకటేశ్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి అఫ్జల్‌గంజ్‌ నుంచి ఇంటికి కారులో ఇంటికి వెళ్తున్నారు. చాదర్‌ఘాట్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోగానే ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారులో ఉన్న వ్యక్తులను కిందకు దించేశాడు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మలక్‌పేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పక్కనే పెట్రోల్‌ బంకులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. మరోవైపు వర్షం కురుస్తున్న నేపథ్యంలో మలక్‌పేట రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని