వర్షం, నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం
తెగిపడిన కరెంటు తీగపై అలీమా కాలువేయటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించినట్టు అనుమానిస్తున్నారు.
చెన్నై: వీధిలో వర్షపు నీరు నిలిచిపోవటంతో వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తున్న ఓ మహిళ ఉన్నట్టుండి కింద పడిపోయింది. తన నివాసానికి స్వల్ప దూరంలో ఉండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. చెన్నై, పెరియార్ నగర్లోని పుళియాంథోపే ప్రాంతానికి చెందిన అలీమా అనే 35 సంవత్సరాల మహిళ తెగిపడిన కరెంటు తీగపై కాలువేయటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దుర్ఘటనకు చెందిన వీడియోలు.. సామాజిక మథ్యమాల్లో వైరల్గా మారాయి.
ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెగిపడిన కరెంటు వైర్లను గురించి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ.. తమిళనాడు విద్యుత్ బోర్డు చర్యలే కరువయ్యాయని స్థానికులు తెలిపారు. మహిళను పొట్టన పెట్టుకున్న వైరు 25 రోజుల క్రితం తెగిపోయిందని.. దీని ద్వారా నీటిలోకి విద్యుత్ ప్రవహిస్తోందని వారు తెలిపారు. ఇదివరకు ఓ చిన్నారి కూడా ఇదేవిధంగా విద్యుదాఘాతానికి గురైందని స్థానికులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యానికి అలీమా బలైందని వారు వాపోయారు.
ఈ ఘటనపై ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం.. మహిళ ప్రాణం తీసిందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని ఆమె అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. శవపరీక్ష అనంతరం మాత్రమే మహిళ మరణానికి గల అసలైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM