నటి దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీ ప్రముఖ హాస్యనటి భారతిసింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియ్యాకు ముంబయి కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది....
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన ప్రముఖ హిందీ హాస్య నటి భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియ్యాకు ముంబయి కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గంజాయి సేవించినట్లు వారు ఒప్పుకోవడంతో డిసెంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో భారతి సింగ్ దంపతులను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)... అక్కడికి కొద్ది గంటలకే ముంబయి కోర్టులో ప్రవేశపెట్టింది. కేసును పరిశీలించిన కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎన్సీబీ శనివారం ఉదయం భారతి సింగ్, హర్ష్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించింది. దీంతో భార్యాభర్తలకు అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరైన దంపతులను, అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించగా... డ్రగ్స్ తీసుకున్నట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో ఇద్దరినీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశారు.
అంతకుముందు ఎన్సీబీ అధికారులు ముంబయిలోని ఖార్ దంగా ప్రాంతంలో సోదాలు నిర్వహించి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివిధ రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారం, ఇతర ఆధారాలతో శనివారం భారతి సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని 15 గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పూత్ మృతితో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం సృష్టించింది. విచారణ చేపట్టిన ఎన్సీబీ ఆ నటుడికి డ్రగ్స్ సరఫరా చేసిన నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రియా వాట్సాప్ ఛాట్ ఆధారంగా ఇండస్ట్రీకి చెందిన అనేక మందికి సమన్లు జారీ చేసి, విచారించారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరైన వారిలో ప్రముఖ నటీనటులతోపాటు దర్శకులు, సహాయ దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా