పులివెందుల వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో వైకాపాలోని వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేంపల్లి మండలం ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లు ..

Updated : 15 Nov 2020 15:27 IST

పులివెందుల: సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో వైకాపాలోని వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేంపల్లి మండలం ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా అదే పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి రాత్రి 10గంటల సమయంలో ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వీరన్నగట్టుపల్లెకు చెందిన పుల్లయ్యవర్గానికి చెందిన నలుగురిని ఇడుపులపాయకు చెందిన చలపతి వర్గం వారు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. పాత కక్షల నేపథ్యంలోనే తమపై దాడి చేశారని పుల్లయ్య వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆర్కే వ్యాలీ ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని