కరోనా సోకిన దంపతుల ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందడం కలకలం సృష్టించింది

Published : 13 Nov 2020 00:58 IST

జగిత్యాలలో ఘటన

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందడం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజి రాంబాబు (45), లావణ్య (40) దంపతులు జగిత్యాలలోని శివవీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఈ క్రమంలో అతని భార్య లావణ్య సైతం పరీక్షలు చేయించుకోగా.. గురువారం ఉదయం ఆమెకు కూడా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న దంపతులు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో వారి ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు అనుమానం వచ్చి తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో.. కిటికీల్లోంచి లోపలకు చూశారు.  ఇంటిలో వారిద్దరూ ఉరి వేసుకున్నట్లు కనిపించడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొవిడ్‌ నిబంధనల మేరకు మృతదేహాలను ఆస్పత్రికి తరలించే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని