పంతంగి వద్ద భారీగా గంజాయి స్వాధీనం

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 23 Aug 2020 02:37 IST

హైదరాబాద్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ తరలిస్తుండగా పంతంగి వద్ద డీఆర్‌ఐ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అందులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 3.56 కోట్ల విలువైన 1,427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్‌ చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని