ఇంటి పైకప్పుపై డబ్బు సంచులు

ఓ వ్యక్తి ఉదయం నిద్రలేవగానే తన ఇంటిపైకప్పుపై రెండు సంచులు ఉన్నట్లు గుర్తించాడు. వాటిల్లో పెద్ద మొత్తంలో నగదు ఉండటంతో ఆశ్చర్యపోయి అతను పోలీసులకు సమాచారం అందించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు

Published : 14 Nov 2020 16:28 IST

 

మేరఠ్‌ : ఓ వ్యక్తి ఉదయం నిద్రలేవగానే తన ఇంటిపైకప్పుపై రెండు సంచులు ఉన్నట్లు గుర్తించాడు. వాటిల్లో పెద్ద మొత్తంలో నగదు ఉండటంతో ఆశ్చర్యపోయి అతను పోలీసులకు సమాచారం అందించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఆ రాష్ర్టంలోని మేరఠ్‌లో నివాసం ఉండే పవన్‌ సింఘాల్‌ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు రూ. 40  లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. 

ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారని ఆ వ్యక్తి భావించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నగదు ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ నగదు లభించిన ఇంటి పక్కన ఉండే వ్యాపారి ఇంట్లో అంతకుముందు రోజు రాత్రి దొంగతనం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి దొంగతనం చేయడానికి రాజుకు సహకరించిన సెక్యురిటీ గార్డును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు