వారిని పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోం
శౌర్యచక్ర బల్విందర్సింగ్ సంధుని హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకునేవరకు మృతదేహానికి అంతిమసంస్కారాలు నిర్వహించబోమని ఆయన కుటుంబం స్పష్టం చేసింది...
వెల్లడించిన బల్విందర్సింగ్ కుటుంబం
చండీగఢ్: శౌర్యచక్ర బల్విందర్సింగ్ సంధుని హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకునే వరకూ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించబోమని ఆయన కుటుంబం స్పష్టం చేసింది. పంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో శుక్రవారం బల్విందర్సింగ్ని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి హత్యచేశారు. కాగా ఇది ఉగ్రవాదుల పనేనని వారిని పట్టుకునే వరకూ సంధు మృతదేహాన్ని ఖననం చేయబోమని కుటుంబసభ్యులు వెల్లడించారు.
సంధు భార్య జగ్దిశ్కౌర్ సంధు మాట్లాడుతూ ‘ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనే. హంతకులను పట్టుకునేంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని నిశ్చయించుకున్నాం’ అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాని ఈ సందర్భంగా ఆమె కోరారు. ‘మా కుటుంబమంతా శౌర్యచక్ర అవార్డు గ్రహీతలమే. ముష్కరులకు వ్యతిరేకంగా పోరాడిన నాకు, నా భర్తకు, ఆయన సోదరుడు రంజిత్సింగ్ సంధుకు, రంజిత్సింగ్ భార్య బల్రాజ్కౌర్ సంధుకు కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్రతో సత్కరించింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే ఈ హత్య చోటు చేసుకుంది’ అని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అందుకు కేంద్రం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్సింగ్ సంధును లిఖీవిండ్లోని ఆయన ఇంటి వద్దే ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఆయన శరీరంలోకి నాలుగు తూటాలు దిగగా ఆసుపత్రికి తరలించేసరికే సంధు ప్రాణాలొదిలారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్సింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం 1993లో శౌర్యచక్రతో సత్కరించింది. కాగా గతేడాదే రాష్ట్ర ప్రభుత్వం సింగ్కు భద్రతను తొలగించింది. కాగా బల్విందర్ హత్యపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం