పట్టపగలే యువతిపై కాల్పులు.. షాకింగ్ వీడియో
దేశరాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది.
దిల్లీ: దేశరాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది. కాగా బుల్లెట్ గాయాలతో బాధితురాలు మరణించడంతో ఫరీదాబాద్లో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయిన ఘటన తాలూకు దృశ్యాలు సంచలనంగా మారాయి.
బల్లభ్గఢ్ ఏసీపీ జైవీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్కు చెందిన నికిత తోమర్(21) అనే యువతి సోమవారం పరీక్ష రాసి కళాశాల నుంచి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో గుర్తు తెలియని కారులో నుంచి తౌసిఫ్ అనే వ్యక్తి వచ్చి పట్టపగలే ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలో తౌసిఫ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో నికితపై కాల్పులు జరిపి పారిపోయాడు. నికిత అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే బుల్లెట్ గాయాలతో ఆమె మరణించింది. ఈ ఘటన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసిఫ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. కాగా బాధితురాలు, నిందితుడు గతంలో ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. గతంలోనూ బాధితురాలి కుటుంబసభ్యులు సదరు నిందితుడిపై కిడ్నాప్ కేసు పెట్టారని.. కానీ తర్వాత వెనక్కి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. వారిని ఎన్కౌంటర్ చేసేవరకు తన కుమార్తె అంత్యక్రియలు జరగనివ్వనని అన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఫరీదాబాద్లో రహదారిపై, బాధితురాలి కళాశాల ఎదుట మంగళవారం నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ హత్యను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ తెలిపారు. ఘటనకు బాధ్యులైన ఇతర నిందితులను సైతం వెంటనే పట్టుకోవాలని హరియాణా డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి