బాలికపై తండ్రి, ప్రియుడు అత్యాచారం 

మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక (17)పై తండ్రి, ఆమె ప్రియుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని వాసింద్‌ పట్టణంలో మూడు రోజుల క్రితం రోడ్డు

Published : 13 Oct 2020 00:29 IST

ముంబయి: మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక (17)పై తండ్రి, ఆమె ప్రియుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని వాసింద్‌ పట్టణంలో మూడు రోజుల క్రితం రోడ్డు పక్కన పడి ఉన్న పిండాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ పిండం ఓ బాలికకు చెందినదిగా గుర్తించారు. అనంతరం సదరు బాలికను విచారించగా ఆమె విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఉపాధ్యాయుడిగా పనిచేసే తండ్రి (51)తోపాటు ప్రియుడు (21) తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు పేర్కొంది. దీంతో బాధితురాలి తండ్రితోపాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని