ఏడుస్తోందని కూతురిని చంపేశాడు!
కూతురు ఏడుస్తుందని తండ్రి గొంతు కోసి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వాసుదేవ్ గుప్తా అనే వ్యక్తి యూపీలోని సుల్తాన్పూర్లో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. 20 రోజుల కిందట భార్యభర్తల మధ్య గొడవ జరిగి
లఖ్నవూ : కూతురు ఏడుస్తుందని గొంతు కోసి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాసుదేవ్ గుప్తా అనే వ్యక్తి యూపీలోని సుల్తాన్పూర్లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేవారు. 20 రోజుల కిందట భార్యభర్తల మధ్య గొడవ జరిగి భార్య మూడేళ్ల బాలుడితో ఇంటి నుంచి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి నాలుగేళ్ల చిన్నారి తల్లికోసం ఏడుస్తూనే ఉంది. అసలే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదనే నిరాశలో ఉన్న అతను బాలిక ఏడుపు ఆపకపోవడంతో విచక్షణ కోల్పోయాడు. గురువారం ఆ చిన్నారిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని టవాల్లో చుట్టి తను నడిపే ఆటోలో వేసుకొని భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. తన భార్య పని చేసే నోయిడాలోని షాపుతో పాటు ఇతర ప్రాంతాల్లో భార్య ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంతకీ భార్య ఆచూకీ దొరకకపోవడంతో కూతురి మృతదేహాన్ని భార్య పనిచేసే దుకాణం బయట పడేయాలనుకున్నాడు.
గురువారం సాయంత్రం గుప్తా ఇంటికి వెళ్లిన అతని తమ్ముడు అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి అన్నకు ఫోన్ చేశాడు. కూతురిని చంపేసి, భార్య కోసం వెతుకుతున్నట్లు తన తమ్ముడికి చెప్పాడు. అతను వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. స్పందించిన పోలీసులు నోయిడాలోని ఓ ప్రాంతంలో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. కూతురు ఆపకుండా ఏడుస్తున్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.