పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని పుణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు....

Updated : 07 Jun 2021 19:55 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని