ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ఏపీ అటవీశాఖ ఉన్నతాధికారి వి.బి.రమణమూర్తి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగోల్‌లోని అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి...

Updated : 01 Oct 2020 12:16 IST

హైదరాబాద్‌: ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి (59) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని రాజీవ్‌గృహకల్ప‌ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె నివాసానికి వెళ్లిన రమణమూర్తి రాత్రి 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రమణమూర్తి ప్రస్తుతం కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా ఉన్నారు. విధినిర్వహణలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. రమణమూర్తి మృతిపై ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని