కారు బోల్తా: నలుగురు హైదరాబాదీలు మృతి

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడికండ్ల వద్ద కారు బోల్తా పడి సంఘటనా స్థలంలోనే నలుగురు...

Published : 10 Dec 2020 00:47 IST

మక్తల్ గ్రామీణం‌: నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడికండ్ల వద్ద కారు బోల్తా పడి సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బడంగ్‌పేటకు చెందిన వినోద్‌ మరో ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు కారులో బయలుదేరారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్ల సమీపంలోని గుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వినోద్‌ తండ్రి ఎల్లయ్య (55), తల్లి గోవిందమ్మ (55), సోదరి హారిక (22), సమీప బంధువు శారద (56) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వినోద్‌కు స్వల్ప గాయాలు కాగా.. కారులో ప్రయాణిస్తున్న మరో బాలుడు శ్రావిక్‌ ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని