హేమంత్ హత్య కేసులో 14 మంది అరెస్ట్
నగరంలో సంచలనం సృష్టించిన యువకుడు హేమంత్ హత్య కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో హేమంత్ భార్య అవంతి బంధువులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చందానగర్కు చెందిన...
నిందితుల్లో అవంతి బంధువులు
వెల్లడించిన మాదాపూర్ డీసీపీ
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన యువకుడు హేమంత్ హత్య కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో హేమంత్ భార్య అవంతి బంధువులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చందానగర్కు చెందిన హేమంత్, అవంతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూన్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి ఇష్టం లేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు అదను కోసం వేచి చూసి పథకం ప్రకారమే కిరాయి హంతకులతో హేమంత్ను అపహరించి గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్టు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
అవంతి మేనమామ యుగంధర్రెడ్డి.. బుచ్చియాదవ్, మరో ఇద్దరితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో వారితో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు డీసీపీ వివరించారు. అవంతితో పాటు హేమంత్ను అపహరించి ఔటర్ రింగు రోడ్డు మీదుగా సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్దకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపారు. సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని మరోసారి విచారిస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి..
ప్రేమ వివాహం.. యువకుడి దారుణహత్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!