లారీ అడ్డగించి.. 14,400 మొబైల్ ఫోన్లు చోరీ
లారీని అడ్డగించిన కొందరు వ్యక్తులు అందులోని మొబైల్ఫోన్లను చోరీ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని ఓ కంపెనీ మొబైల్ ప్లాంట్ నుంచి లారీలో రూ. 15 కోట్లు విలువ చేసే 14,400 ఫోన్లు ముంబయికి తీసుకెళుతుండగా
చెన్నై : సెల్ఫోన్ల లోడుతో వెళుతున్న లారీని అడ్డగించిన కొందరు వ్యక్తులు అందులోని మొబైల్ ఫోన్లను చోరీ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని ఓ కంపెనీ మొబైల్ ప్లాంట్ నుంచి లారీలో రూ. 15 కోట్లు విలువ చేసే 14,400 ఫోన్లు ముంబయికి తీసుకెళుతుండగా కొందరు ఆ వాహనాన్ని రోడ్డుపై మరో లారీతో అడ్డగించారు. మొబైల్ ఫోన్లు ఉన్న లారీలోని డ్రైవర్, క్లీనర్ల చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసిన దుండగులు లారీలోని ఫోన్లు ఉన్న బాక్సులను వాళ్ల లారీలోకి ఎక్కించారు. అనంతరం డ్రైవర్, క్లీనర్లను రోడ్డుకు సమీపంలోని ఓ ముళ్లపొదల్లో పడేశారు. లారీని సైతం దుండగులు తీసుకెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతానికి 8 కిమీ దూరంలో ఆ లారీని వాళ్లు వదిలేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడు- బెంగళూరు జాతీయ రహదారిపై పది మంది వ్యక్తులు ఈ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన కొంతసేపటికి కాళ్లు, చేతులకు కట్టిన తాళ్లను విడిపించుకున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు పైకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న 108 వాహనంలో వాళ్లు స్థానిక ఆసుప్రతికి చేరుకొని పోలీసులకు చోరీ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 17 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.