పెళ్లికి ముందు ఫొటోషూట్.. విషాదాంతం
కొద్ది రోజుల్లో ఏడడుగులు వేయాల్సిన ఓ జంట.. నీటిలో మునిగి మృత్యువు పాలైన విషాద సంఘటన
టైటానిక్లా చేయబోయి కాబోయే దంపతుల మృతి
మైసూరు: కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ జంట.. నీటిలో మునిగి మృత్యువు పాలైన విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రముఖ ఇంగ్లీషు చిత్రం టైటానిక్ లాగా ఫోటో తీయించుకోవాలన్న వీరి సరదా ప్రాణాలను బలిగొంది. యువతి ధరించిన ఎత్తుమడమల చెప్పులే (హైహీల్స్) వీరి మరణానికి కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు.
మైసూరు జిల్లా, యఖ్యాతమరానహళ్లికి చెందిన చంద్రు (28), శశికళ (20) దూరపు బంధువులు. వీరికి గత సంవత్సరం నవంబరు 22న వీరి నిశ్చితార్థం జరుగగా.. ఈ ఏడాది నవంబర్ 22న వివాహం జరగాల్సి ఉంది. ఈ లోగా వీరు వివాహానికి ముందు జరిపే ‘ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్’ కోసం టీ నరసిపూర తాలూకా, ముడుకుథూరుకు వెళ్లారు. కావేరీ నదిలో పుట్టి (చిన్న పడవ)లో ప్రయాణం ఇక్కడ పర్యాటక ఆకర్షణ. తమకు టైటానిక్ చిత్రంలో మాదిరిగా ఫోటో తీయాల్సిందిగా ఈ జంట కోరారు. ఇందుకుగాను ఒడ్డు నుంచి 20 మీటర్ల దూరంలో ఓ పుట్టిలో వీరు నిలబడి ఉండగా.. ఫోటోగ్రఫర్, యువతి సోదరుడు ఒడ్డున ఉన్నారు. ఈ క్రమంలో హైహీల్స్ ధరించిన శశికళ పట్టుతప్పి ఒక వైపు ఒరిగి పోయింది. దీనితో పుట్టి అదుపుతప్పి బోల్తాపడింది. దానిని నడుపుతున్న మూగప్పతో సహా ముగ్గురూ నీటిలో పడిపోయారు. నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. చంద్రు, శశికళ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు.
సమాచారమందిన తాలక్కాడ్ పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికి తీయించారు. అంతకు ముందు తాలక్కాడ్ దేవాలయం వద్ద ఫోటో షూట్ జరుపుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవటంతో వారు ఇక్కడికి వెళ్లాల్సి వచ్చిందని మృతుల బంధువులు విచారం వ్యక్తం చేశారు. పుట్టిలో ప్రయాణం అస్థిరంగా సాగుతుందని.. కాస్త అదుపు తప్పినా పెనుప్రమాదం సంభవింస్తుందని పోలీసులు వివరించారు. ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా లైఫ్ జాకెట్లను ధరించడం తప్పనిసరి చేయాల్సిందిగా నీటి పారుదల శాఖకు లేఖ రాస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు