50 మందిని చంపాక.. లెక్క మర్చిపోయా!
యాభై తరువాత తాను హత్యలను లెక్కపెట్టలేదని అతను వెల్లడించటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.
విచారణలో వెల్లడించిన ‘సీరియల్ కిల్లర్’ వైద్యుడు
దిల్లీ: దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడిన ఓ వైద్యుడిని దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విచారణలో భాగంగా 50 తరువాత తాను హత్యలను లెక్కపెట్టలేదని అతను వెల్లడించటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణ, రాజస్థాన్లలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కచ్చితంగా నిర్ధారణ కానప్పటికీ.. వందకు పైగా హత్యల్లో ఈ వైద్యుడి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్, అలీఘర్కు చెందిన దేవేందర్ శర్మ (62) ఆయుర్వేద వైద్యం, శస్త్రచికిత్సలో పట్టభద్రుడు. తొలుత వైద్యవృత్తినే చేపట్టినా.. అనంతరం దారితప్పి పలు కిడ్నాప్, హత్య కేసుల్లో భాగస్వామి అయ్యాడు. నకిలీ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ, మూత్రపిండాల అక్రమ అమ్మకం వంటి నేరాలపై గతంలో కూడా శర్మ జైలుశిక్షను అనుభవించాడు. దేవేందర్, అతని భాగస్వాములు గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కులను తమ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆపేవారు. డ్రైవర్లను హత్య చేసి టక్కులోని సిలండర్లను సొంతం చేసుకునేవారు. మృతదేహాలను కాష్గంజ్ వద్ద మొసళ్లకు నిలయమైన హజారా కాలువలో పడేసేవారని దిల్లీ పోలీసులు తెలిపారు.
నిందితుడు ఓ హత్య కేసులో జైపూర్ కేంద్ర కారాగారంలో జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. 16 సంవత్సరాల శిక్షాకాలం అనంతరం ఇతనికి జనవరిలో 20 రోజుల పెరోల్ లభించింది. ఆ తర్వాత గడువు ముగిసినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు దిల్లీ శివారు ప్రాంతమైన బప్రోలాలో అతని ఆచూకీ చిక్కడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తనకు 50కి పైగా హత్యకేసుల్లో ప్రమేయమున్నట్టు అంగీకరించాడు. కేసుకు సంబంధించిన వివరాలను తెలియ చేసిన అనంతరం.. దేవేందర్ శర్మను జైపూర్ పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా