చిన్నచింతకుంటలో ప్రేమికుల ఆత్మహత్య
పెద్దలు ప్రేమకు అంగీకరించలేదని ఓ ప్రేమజంట శీతల పానీయంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా
చిన్నచింతకుంట: పెద్దలు ప్రేమకు అంగీకరించలేదని ఓ ప్రేమజంట శీతల పానీయంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్ (23), అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.
బాలిక మైనర్ కావడం.. ప్రేమికుల కులాలు కూడా వేర్వేరనే కారణంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఈ నెల 15న రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉంద్యాలలో స్థానికులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్తున్న సమయంలో వీరిద్దరూ విగత జీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్న చింతకుంట ఎస్సై సంతోష్ తెలిపారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!